మా జోలికి వస్తే.. వైసీపీ నేతలకు గుండు కొట్టిస్తా: లోకేష్

Nara Lokesh | వైసీపీ నేతలకు మరోసారి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు టీడీపీ యువనాయకుడు నారా లోకేష్. మా జోలికి వస్తే.. వైసీపీ నేతలకు గుండు కొట్టిస్తానని హెచ్చరించారు. యువగళం పాదయాత్రలో వైసీపీ కార్యకర్తల ఓవరాక్షన్ కు మండిపడ్డ లోకేష్.. వైసీపీ నేతలకు మీసం మెలేసి వార్నింగ్ ఇచ్చాడు. వైసీపీ ప్రభుత్వ తీరుపై అనుక్షణం విమర్శలు గుప్పిస్తున్న సీఎం.. అభివృద్ధి అంటే స్టిక్కర్లు, రంగులు వేసుకోవడమా? అంటూ ప్రశ్నించారు. ఆదోనిలోని వెంకన్నపేట వార్డు సచివాలయంపై మాట్లాడుతూ.. టీడీపీ హయాంలో ఇక్కడ వేలాది పేదప్రజల ఆకలితీర్చే అన్న క్యాంటీన్ ఏర్పాటు చేశాం. కానీ వైసీపీ ప్రభుత్వం.. అన్నా క్యాంటిన్ ని తీసేసి సచివాలయంగా మార్చేసింది. అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో ఎక్కడా కూడా ఒక్క ఇటుక పెట్టడం చేతకాలేదు కానీ.. అన్నా క్యాంటిన్ లను ఇలా సచివాలయాలుగా మార్చి.. పార్టీ రంగులు వేసుకుంటారా? అని మండిపడ్డారు. ఇంకెన్ని రోజులు ఈ స్టిక్కర్ల బతుకు అంటూ తనదైన రీతిలో మండిపడ్డారు లోకేష్.

Latest Articles

వెలిగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించిన నిమ్మల

మార్కాపురం జిల్లా దోర్నాల వద్ద నిర్మిస్తోన్న వెలిగొండ ప్రాజెక్ట్ పనులను ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. ప్రాజెక్టు పురోగతి పనులపై మంత్రి ఆరా తీశారు. ప్రత్యేక వాహనంలో రెండో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్