బ్రేకింగ్: అవినాశ్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా

వివేకా హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను తెలంగాణ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. రేపు సాయంత్రం 4గంటలకు అవినాశ్ రెడ్డిని విచారణకు పిలవండని సీబీఐకి ఆదేశాలు జారీచేసింది. విచారణ సందర్భంగా అవినాశ్ రెడ్డి, సీబీఐ తరపు లాయర్లు వాడివేడిగా తమ వాదనలు వినిపించారు.

రాజకీయ కుట్రలో భాగంగా అవినాశ్ రెడ్డిని ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన తరపు న్యాయవాది తెలిపారు. సీబీఐకి భయపడే అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డి పేర్లు దస్తగిరి చెప్పాడని వాదించారు.

అటు ఈ కేసులో వివేకా తొలుత గుండెపోటుతో చనిపోయారని అవినాశ్ రెడ్డి హడావిడి చేశారని.. పోలీసులకు కూడా ఫోన్ చేసిందని అతనే అని సీబీఐ తరపు లాయర్ వాదనలు వినిపించారు. ఈ క్రమంలో విచారణకు వస్తే అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా? అని హైకోర్టు ప్రశ్నించగా.. అవసరమైతే అరెస్ట్ చేస్తామని సీబీఐ లాయర్ తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం విచారణను రేపటికి వాయిదావేసింది.

Latest Articles

జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్