25.2 C
Hyderabad
Friday, February 14, 2025
spot_img

జగన్, అవినాశ్ రెడ్డి నుంచి ప్రాణహాని ఉంది: దస్తగిరి

ఏపీ సీఎం జగన్, వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందని వివేకా హత్య కేసులో అప్రూవర్ దస్తగిరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో అప్రూవర్ గా మారాలని సునీత, సీబీఐ తనకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. మీ వైపు ఉన్నప్పుడు మంచివాడిని.. ఇప్పుడేమో చెడ్డవాడినా? అని ప్రశ్నించారు. డబ్బుల కోసం ఎర్ర గంగిరెడ్డి చెప్పినట్లు చేశానని.. తర్వాత తప్పు తెలుసుకున్నాను కాబట్టే అప్రూవర్ గా మారానని పేర్కొన్నారు.

పలుకుబడి ఉందని సీబీఐ ఎస్పీ రాంసింగ్ ను మార్చేశారని దస్తగిరి ఆరోపించారు. దర్యాప్తు అధికారి మారినంత మాత్రాన విచారణ దారి తప్పదని.. మీ పాత్ర ఉంది కాబట్టే సీబీఐ కొత్త బృందం కూడా విచారణ ముమ్మరం చేసిందన్నారు. పులివెందులలోనే ఉన్న  తాను దేనికైనా సిద్ధంగానే ఉన్నానని తెలిపారు. వివేకా హత్య కేసులో మీరు తప్పు చేసినట్లు రుజువైతే సీఎం పదవికి జగన్, ఎంపీ పదవికి అవినాశ్ రెడ్డి రాజీనామా చేస్తారా? అని దస్తగిరి డిమాండ్ చేశారు.

Latest Articles

మేడిగడ్డపై తుది నివేదిక రెడీ

మేడిగడ్డపై తుది నివేదిక వచ్చేసింది. నిపుణుల కమిటీ తమ నివేదికను NDSA ఛైర్మన్‌కు అందించింది. కేంద్ర జలశక్తి ఆమోదం తర్వాత సంబంధిత రిపోర్ట్‌ రాష్ట్ర ప్రభుత్వానికి పంపనున్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్