పులివెందుల సీఐపై విచారణకు సీఈవో ఆదేశం

TDP MLC Bhumi Reddy Ramagopal Reddy | వైఎస్‌ఆర్‌ జిల్లా పులివెందుల పట్టణ సీఐపై విచారణకు ఆదేశించారు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌కుమార్‌ మీనా. పట్టభద్రుల ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా సీఐ పనిచేశాడని.. టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్‌ రెడ్డి సీఈవోకు ఫిర్యాదు చేశారు. మార్చి 13న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతుండగా.. వైసీపీ నాయకులు అనుమతి లేకుండా కౌంటింగ్‌ కేంద్రాల్లోకి వెళ్లారని ఆరోపించారు. ఆ సమయంలో సీఐగా ఉన్న రాజు సహకారంతోనే వారు వెళ్లారని భూమిరెడ్డి తన ఫిర్యాదులో తెలిపారు. రామగోపాల్‌ ఫిర్యాదుపై స్పందించిన సీఈవో.. దీనిపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించారు. విచారించిన అనంతరం నివేదికను అందించాలని రాష్ట్ర డీజీపీ, జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు.

 

Latest Articles

సైబర్‌ క్రైమ్‌ కేసులో హైదరాబాద్ వ్యాపారిని అరెస్టు చేసిన కొచ్చి పోలీసులు

సైబర్‌ క్రైమ్‌ కేసులో హైదరాబాద్‌ వ్యాపారిని కొచ్చి పోలీసులు అరెస్టు చేయడం సంచలనం సృష్టించింది. 24 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు ఆరోపణలు రావడంతో ప్రధాన నిందితుడు హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి అల్లంరాజు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్