హైదరాబాద్ రవీంద్ర భారతిలో ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ‘ఎల్ నినో – తెలంగాణ సన్నాహకత’ సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి మహమ్మద్ అజహరుద్దీన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఎల్ నినో ప్రభావంతో వర్షాలు తగ్గితే జల విద్యుత్ ఉత్పత్తి పడిపోయి విద్యుత్ డిమాండ్ విపరీతంగా పెరుగుతుందన్నారు. ప్రస్తుతం వర్షాకాలంలోనూ ఏప్రిల్ నాటి పీక్ డిమాండ్ నమోదవుతోందని తెలిపారు. ఆర్థిక భారం తగ్గించుకునేందుకు రైతులు, ప్రజలు పగటిపూట లభించే చౌకైన సోలార్ విద్యుత్ను గరిష్టంగా వినియోగించుకోవాలని సూచించారు. అనంతరం మంత్రి అజహరుద్దీన్ మాట్లాడుతూ.. ఎల్ నినో సవాళ్లను ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని పిలుపునిచ్చారు.
రవీంద్ర భారతిలో ‘ఎల్ నినో – తెలంగాణ సన్నాహకత’ సదస్సు
0
68
Previous article
Next article
Latest Articles
క్షమాపణ చెబుతారని అనుకన్నా.. కానీ డైవర్షన్ చేస్తున్నారు- స్పీకర్
అసెంబ్లీ దగ్గర నిన్న జరిగిన ఘటనపై సభలో క్షమాపణ చెబుతారని అనుకున్నానని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. చిట్చాట్లో మాట్లాడిన ఆయన.. వాస్తవానికి మైక్ ఇవ్వద్దు.. తాను స్పీకర్గా నాలుగు వైపుల...
- Advertisement -
- Advertisement -


