బ్యాంకాక్ నుంచి ముంబైకి వచ్చిన ఓ మోడల్ భారీ మొత్తంలో హైడ్రోపోనిక్ గంజాయిని తరలిస్తూ కస్టమ్స్ అధికారులకు పట్టుబడింది. ఆమె వద్ద నుంచి 11 కిలోలకుపైగా నాణ్యత కలిగిన హైడ్రోపోనిక్ మారిజువానాను స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశారు. అరెస్టయిన మహిళను హర్ష సన్నీగా గుర్తించారు. జూన్ 10-11 తేదీల మధ్య రాత్రి బ్యాంకాక్ నుంచి ఎయిర్ ఇండియా విమానం టీజీ-351లో ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. విమానాశ్రయంలో సాధారణ నిఘా తనిఖీల సందర్భంగా ఆమె ప్రవర్తన అనుమానాస్పదంగా కనిపించడంతో కస్టమ్స్ అధికారులు ఆపి తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఆమె వద్ద భారీ మొత్తంలో హైడ్రోపోనిక్ గంజాయి ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.పట్టుబడిన గంజాయి విలువ రూ.11.82 కోట్లు ఉంటుందని అంచనా వేశారు.
రూ.11.82 కోట్ల విలువైన గంజాయితో పట్టుబడిన మోడల్
0
63
Previous article
Latest Articles
సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రికి కేసీఆర్.. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై ఆరా
సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రికి మాజీ సీఎం కేసీఆర్ వచ్చారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. అనంతరం డాక్టర్లతో మాట్లాడి పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య...
- Advertisement -
- Advertisement -


