Nara Lokesh Warns Peddireddy Ramachandra Reddy| టీడీపీ యువనేత నారా లోకేశ్ మంత్రి పెద్దిరెడ్డి రామంచంద్రారెడ్డి పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ప్రస్తుతం లోకేశ్ పాదయాత్ర పెద్దిరెడ్డి నియోజకవర్గం పుంగనూరులో కొనసాగుతోంది. పుంగనూరులో పెద్దిరెడ్డిని పెద్దాయన అని పిలవాలంట.. భూములు దోచుకున్నందుకు పెద్దాయన అని పిలవాలా? ఇసుకను దోపిడీ చేసినందుకు పెద్దాయన అని పిలవాలా? దేనికి పిలవాలని లోకేశ్ ప్రశ్నించారు. పుంగనూరులో మాత్రం అమూల్ డైరీ లేదని.. పెద్దిరెడ్డికి చెందిన శివశక్తి డైరీనే తక్కువ ధర చెల్లిస్తూ పాడి రైతులను మోసం చేస్తున్నారని విమర్శించారు. రూ.10వేల కోట్లను దోచుకున్న పెద్దిరెడ్డిని శాశ్వతంగా ఇంటికి పంపిస్తామని హెచ్చరించారు. దోచుకున్నదంతా కక్కించి పుంగనూరు ప్రజలకు కానుకగా ఇస్తామన్నారు. తగ్గేదే లేదని, ఏం చేసుకుంటావో చేసుకో పెద్దిరెడ్డీ అంటూ లోకేశ్(Nara Lokesh) సవాల్ విసిరారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మదనపల్లి జిల్లాను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
Nara Lokesh | తగ్గేదే లేదు.. ఏం చేసుకుంటావో చేసుకో.. పెద్దిరెడ్డికి లోకేశ్ మాస్ వార్నింగ్
0
563
Latest Articles
మెక్సికోలో భారీ భూకంపం.. 7.4 తీవ్రతతో నమోదు
మెక్సికోలో భారీ భూకంపం సంభవించింది. చియాపాస్ రాష్ట్రంలోని తీర ప్రాంత పట్టణమైన ప్యూర్టో మడెరోలో భూప్రకంపనలు వచ్చాయి. భూకంప తీవ్రత 7.4 తీవ్రతతో నమోదైంది. భూ ఉపరితలం నుంచి 10 కిలోమీటర్ల లోతులోనే...
- Advertisement -
- Advertisement -


