కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు విజయ డైరీ పేరుతో తమ పాల ప్యాకెట్లను విక్రయిస్తున్నారని..తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కో-ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి అన్నారు. అలాంటి పాలను కొనుగోలు చేయవద్దని ఆయన పేర్కొన్నారు. లాలాపేట్లోని విజయ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో డైరీ ఎండీ చంద్రశేఖర్ రెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. ప్రజలు విజయ తెలంగాణ అని బ్రాండ్ ఉంటేనే పాలను కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎవరైనా తెలంగాణ నకిలీ పాలను డిస్ట్రిబ్యూటర్స్ వెండర్స్ కొనుగోలు చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే తాము కోర్టును ఆశ్రయించడం జరిగిందన్నారు. ఇలాంటి నకిలీ విజయ పాలతో వచ్చిన ఉత్పత్తులను కొనుగోలు చేయవద్దని సూచించారు.
ఆ పాలను కొనుగోలు చేయవద్దు- అమిత్రెడ్డి
0
164
Previous article
Latest Articles
నేను బీఆర్ఎస్ కు దూరమవుతున్నానని… మల్లారెడ్డి వ్యాఖ్యలపై చర్చ
మేడ్చల్లో మాజీ మంత్రి మల్లారెడ్డి వీడియో వైరల్ అయింది. ఒక కార్యకర్త పుట్టిన రోజు వేడుకల్లో మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను బీఆర్ఎస్కు దూరమవుతున్నానని.. తనను మర్చిపోతున్నారని అన్నారు. స్వయంగా మల్లారెడ్డి...
- Advertisement -
- Advertisement -


