బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్.. కు టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. టాలీవుడ్ స్టార్స్ నటించే సినిమాల్లో క్రేజీ ఆఫర్స్ అందుకుంటున్నాడు సంజయ్ దత్. టాలీవుడ్ నుంచి సంజుకు మరో ఆఫర్ వచ్చిందని.. ఇప్పుడు మెగా మూవీలో నటించేందుకు సంజయ్ దత్ ను ఎంపిక చేశారని తెలిసింది. ఇంతకీ.. సంజు భాయ్ మెగా హీరోల్లో ఏ హీరో సినిమాలో నటించనున్నాడు..?
రామ్, పూరి కాంబోలో తెరకెక్కిన డబుల్ ఇస్మార్ట్ లో విలన్గా కనిపించిన సంజూ.. ఆతర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ది రాజాసాబ్ లోనూ ఛాన్స్ అందుకొన్నాడు. అలాగే నటసింహం బాలయ్య అఖండ 2లో ఆయన విలన్ గా నటిస్తున్నాడు. ఇప్పుడు ఓ మెగా మూవీ లోనూ విలన్గా సెలక్ట్ అయ్యాడు. మెగాస్టార్ మేనల్లుడు సాయిదుర్గ తేజ్.. ఇప్పుడు సంబరాల ఏటిగట్టు అనే భారీ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ మూవీ నుంచి గ్లింప్స్ రిలీజ్ చేస్తే.. ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అయితే.. ఈ మూవీలో విలన్ గా నటించేందుకు బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ను ఫైనల్ చేశారని తెలిసింది.
సంబరాల ఏటిగట్టు చిత్రంలో విలన్ పాత్ర కోసం సంజయ్దత్ని ఇటీవల చిత్రబృందం కలిసింది. దర్శకుడు కథ చెప్పాడు. నిర్మాత మంచి రెమ్యునరేషన్ ఆఫర్ చేశాడు. దాంతో సంజూ ఈ ప్రాజెక్ట్ లోకి వచ్చేశాడని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ లో ఓ ఫైట్ తెరకెక్కిస్తున్నారు. రామ్ లక్ష్మణ్ ఈ ఫైట్ కంపోజ్ చేస్తున్నారు. సంజూ త్వరలోనే సెట్స్ లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. నూతన దర్శకుడు రోహిత్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో ఐశ్వర్య లక్ష్మి కథానాయిక. దాదాపు 100 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన ఓ గ్లింప్స్ కోసం ఏకంగా 2కోట్లకు పైగా ఖర్చు చేసినట్టు టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు సంజు కూడా ఈ ప్రాజెక్ట్ లోకి రావడంతో మరింత క్రేజ్ ఏర్పడింది. మరి.. ఈ మూవీతో తేజ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధిస్తాడేమో చూడాలి.