ఏపీలో విద్యుత్ చార్జీల పెంపుపై వైసీపీ పోరుబాట పట్టింది. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం వైసీపీ కార్యాలయం నుండి పార్టీ శ్రేణులతో కలిసి మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం రాజానగరం విద్యుత్ ఆఫీస్ వద్ద అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఎన్నికలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం బాబు ష్యూరిటీ.. బాదుడు గ్యారంటీ అంటూ దగా చేస్తోందని రాజా మండిపడ్డారు. అబద్ధపు వాగ్దానాలు చేసి ప్రజల ఓట్లు వేయించుకున్న కూటమి సర్కార్ ఇప్పుడు ఆ ప్రజలనే బాదుతోందని ఆయన విమర్శించారు. విద్యుత్ రంగాన్ని నిట్టనిలువునా ముంచేసింది చంద్రబాబు నాయుడు అని జక్కంపూడి రాజా ఆరోపించారు.
విద్యుత్ చార్జీల పెంపుపై రాజానగరం కరెంట్ ఆఫీసులో వినతిపత్రం
0
171
Latest Articles
హెలో స్పేస్.. విక్రమ్ 1 వచ్చేసింది.. స్కైరూట్తో భారత అంతరిక్ష చరిత్రలో మరో చారిత్రక రాకెట్ ప్రయోగం
భారత అంతరిక్షరంగంలో మరో ప్రైవేటు రంగానికి బాటలు పడ్డాయి. విక్రమ్-1 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. హైదరాబాద్కు చెందిన ప్రముఖ స్పేస్టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరో స్పేస్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి...
- Advertisement -
- Advertisement -


