ఏపీలో విద్యుత్ చార్జీల పెంపుపై వైసీపీ పోరుబాట పట్టింది. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం వైసీపీ కార్యాలయం నుండి పార్టీ శ్రేణులతో కలిసి మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం రాజానగరం విద్యుత్ ఆఫీస్ వద్ద అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఎన్నికలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం బాబు ష్యూరిటీ.. బాదుడు గ్యారంటీ అంటూ దగా చేస్తోందని రాజా మండిపడ్డారు. అబద్ధపు వాగ్దానాలు చేసి ప్రజల ఓట్లు వేయించుకున్న కూటమి సర్కార్ ఇప్పుడు ఆ ప్రజలనే బాదుతోందని ఆయన విమర్శించారు. విద్యుత్ రంగాన్ని నిట్టనిలువునా ముంచేసింది చంద్రబాబు నాయుడు అని జక్కంపూడి రాజా ఆరోపించారు.
విద్యుత్ చార్జీల పెంపుపై రాజానగరం కరెంట్ ఆఫీసులో వినతిపత్రం
0
185
Latest Articles
విజయసాయిరెడ్డి లక్ష్యం నెరవేరేనా?
ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రంపై మూడో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సిద్ధమయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలక నేతగా వ్యవహరించిన ఆయన, ఇప్పుడు ఆ పార్టీకి పూర్తిగా...
- Advertisement -
- Advertisement -


