తెలుగు రాష్ట్రాలకు భారీ విరాళం ప్రకటించిన మెగాస్టార్ చిరంజీవి

తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల సహాయార్థం మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళమిచ్చారు. రెండు రాష్ట్రాలకు కలిపి కోటి విరాళం ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయనిధికి చెరో రూ.50 లక్షలు ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం వల్ల ప్రజలకు కలిగిన, కలుగుతున్న కష్టాలు తనను కలచివేస్తున్నాయని చిరంజీవి అన్నారు. పదుల సంఖ్యలో అమాయకులు ప్రాణాలు కోల్పోవడం ఎంతో విషాదకరం అని అన్నారు.

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నాయకత్వంలో రెండు ప్రభుత్వాలు శాయశక్తులా పరిస్థితిని మెరుగుపరచడానికి కృషి చేస్తున్నాయని చెప్పారు. మనందరం ఏదోవిధంగా సహాయక చర్యల్లో పాలుపంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ప్రక్రియలో భాగంగా రెండు రాష్ట్రాల్లోని ప్రజల ఉపశమనానికి తోడ్పాటుగా తన వంతు కోటి రూపాయలు విరాళంగా ప్రకటిస్తున్నానని చిరంజీవి ట్వీట్ చేశారు. ఈ విపత్కర పరిస్థితులు తొందరగా తొలగిపోవాలని ప్రజలంతా సురక్షితంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని మెగాస్టార్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

Latest Articles

సాయికృష్ణ బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా- తల్లి విజయలక్ష్మి

విజయవాడకు చెందిన సాయికృష్ణ మృతి కేసులో మెజిస్టీరియల్ ముందు విచారణకు హాజరయ్యారు అతని తల్లి విజయలక్ష్మి. సుమారు రెండు గంటల పాటు విచారణ అధికారి కేసుకు సంబంధించిన విషయాలను అడిగి సమాచారం తీసుకున్నారు....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్