25.3 C
Hyderabad
Tuesday, July 1, 2025
spot_img

తెలుగు రాష్ట్రాలకు భారీ విరాళం ప్రకటించిన మెగాస్టార్ చిరంజీవి

తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల సహాయార్థం మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళమిచ్చారు. రెండు రాష్ట్రాలకు కలిపి కోటి విరాళం ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయనిధికి చెరో రూ.50 లక్షలు ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం వల్ల ప్రజలకు కలిగిన, కలుగుతున్న కష్టాలు తనను కలచివేస్తున్నాయని చిరంజీవి అన్నారు. పదుల సంఖ్యలో అమాయకులు ప్రాణాలు కోల్పోవడం ఎంతో విషాదకరం అని అన్నారు.

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నాయకత్వంలో రెండు ప్రభుత్వాలు శాయశక్తులా పరిస్థితిని మెరుగుపరచడానికి కృషి చేస్తున్నాయని చెప్పారు. మనందరం ఏదోవిధంగా సహాయక చర్యల్లో పాలుపంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ప్రక్రియలో భాగంగా రెండు రాష్ట్రాల్లోని ప్రజల ఉపశమనానికి తోడ్పాటుగా తన వంతు కోటి రూపాయలు విరాళంగా ప్రకటిస్తున్నానని చిరంజీవి ట్వీట్ చేశారు. ఈ విపత్కర పరిస్థితులు తొందరగా తొలగిపోవాలని ప్రజలంతా సురక్షితంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని మెగాస్టార్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్