ఇసుక అక్రమ రవాణాపై అనంతపురం కలెక్టర్ వినోద్ కుమార్ వార్నింగ్ ఇచ్చారు. ఎలక్షన్ కోడ్ అమలులో ఉండటం, పైనుంచి ఆదేశాలు రావడంతో తాడిపత్రి సమీప పెన్నానదిలోని ఇసుక రేవును అధికారులు మూసివేశారు. అయితే, ఇసుకరేపు ఉన్న చోట సీసీ కెమెరాలు లేకపోవడంతో ఇంతకాలం అక్రమంగా ఇసుక రవాణా అవుతోందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో కలెక్టర్ వినోద్ కుమార్ తాడి పత్రి ఇసుక రేవులను పరిశీలించారు. ఇసుక అక్రమంగా రవాణా అవుతుండటంతో సంబంధిత అధికారు లపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇసుక అక్రమ రవాణా కాకుండా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
ఇసుక అక్రమ రవాణాపై అనంతపురం కలెక్టర్ వార్నింగ్
0
261
Next article
Latest Articles
సరికొత్త సంచలనాలకు తెరలేపిన బొద్దింక జనతా పార్టీ
సోషల్ మీడియాలో వైరల్ కావడం చాలా సులువు. ఈ రోజుల్లో చీఫ్ జస్టిస్ ఓ కేసు సందర్భంగా చేశారంటున్న వ్యాఖ్యల నేపథ్యాన్ని వాడుకుని గత వారంలో కొత్తగా రెండు రాజకీయ పార్టీలు ఆవిర్భవించాయి....
- Advertisement -
- Advertisement -


