హైదరాబాద్: పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు, ఆత్మీయత మతసామరస్యానికి ప్రతీక అని సూచిరిండియా అధినేత లయన్ కిరణ్ అన్నారు. సోమవారం మెర్క్యూరే హోటల్ లో సూచిరిండియా ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందులో ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లయన్ కిరణ్ మాట్లాడుతూ… ముస్లిం సోదరులు రంజాన్ మాసం అంతా భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు ఆచరించే ముస్లిం సోదరులు ఇచ్చే ఇఫ్తార్ విందు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయన్నారు. అనాథ ముస్లిం బాలలకు ఇఫ్తార్ విందుతో పాటు బట్టలు ఇచ్చారు. ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్న వారు రంజాన్ పండుగ ప్రజల జీవితాలలో సుఖసంతోషాలను నింపాలని ఆ అల్లాహ్ ను కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేత ఫిరోజ్ ఖాన్ తో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు పాల్గొన్నారు.
మతసామరస్యానికి ప్రతీక ఇఫ్తార్ విందు: లయన్ కిరణ్
0
190
Previous article
Next article
Latest Articles
బండి భగీరథ్ను అరెస్టు చేశాము.. సరెండర్ అవ్వలేదు- రేవంత్ రెడ్డి
బండి భగీరథ్ను అరెస్టు చేశామని.. సరెండర్ కాలేదని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అప్పా జంక్షన్లో వాహనాల తనిఖీల్లో భగీరథ్ పోలీసులకు చిక్కాడని అన్నారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసి చట్ట ప్రకారం వెళ్లామని...
- Advertisement -
- Advertisement -


