నిజం గెలవాలి అంటూ మరోసారి ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి. ఇందులో భాగంగా నేటి నుంచి జనంలోకి వెళ్లనున్నారు. తన పర్యటనలో భాగంగా మూడు రోజుల పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు నారా భువనేశ్వరి. ఇప్పటికే చిత్తూరు జిల్లాతోపాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లోనూ నిజం గెలవాలి పేరుతో బాధిత కుటుంబాలను పరామర్శించారు. . తాజాగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా లో పర్యటించేందుకు సిద్ధమయ్యారు భువనేశ్వరి. చంద్రబాబు అరెస్ట్తో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబా లను పరామర్శించనున్నారు భువనేశ్వరి. మూడు రోజుల పాటు జరగనున్న ఈ పర్యటనలో తొలుత జగ్గంపేటలో పర్యటిస్తా రు భువనేశ్వరి. అనంతరం పెద్దాపురం, తుని, కాకినాడలోనూ బాధిత కుటుంబాలను పరామర్శించనున్నారు. వారిని ఓదార్చిమేమున్నామంటూ బాధిత కుటుంబాలకు భరోసా ఇవ్వనున్నారు.


