36.1 C
Hyderabad
Thursday, April 24, 2025
spot_img

అధిష్ఠానం ఆదేశిస్తే కామారెడ్డిలో పోటీకి సిద్ధం: రేవంత్‌రెడ్డి

స్వతంత్ర వెబ్ డెస్క్: అధిష్ఠానం ఆదేశిస్తే కామారెడ్డిలో పోటీకి సిద్ధమని టీపీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. తానైనా లేదా.. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అయినా పార్టీ ఆదేశిస్తే పోటీకి సిద్ధమని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఆయన తనయుడు, మంత్రి కేటీఆర్‌ను చిత్తుగా ఓడించేందుకు రెడీగా ఉన్నామని తెలిపారు. కొడంగల్‌లో పోటీ చేయాలని కేసీఆర్‌ను ఆహ్వానించానని.. కానీ.. కొడంగల్‌లో పోటీకి కేసీఆర్‌ రాకపోతే కామారెడ్డిలో పోటీ చేస్తానని చెప్పుకొచ్చారు. “ఉమ్మడి ఏపీలో ప్రజలు ఎప్పుడూ హంగ్‌కు అవకాశం ఇవ్వలేదు. తెలంగాణలోనూ హంగ్‌ ఎప్పుడూ రాలేదు. ఈ ఎన్నికల్లో మూడింట రెండో వంతు మెజారిటీతో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుంది. రాజగోపాల్‌రెడ్డి, వివేక్‌, విశ్వేశ్వర్‌రెడ్డి, విజయశాంతి, డీకే అరుణ, జితేందర్‌రెడ్డి బీజేపీలో చేరారు. అయితే బీజేపీ, బీఆర్ఎస్ నేతలు దోచుకున్నది పంచుకుంటున్నారని గ్రహించారు. దోపిడీదారులతో ఇమడలేమని.. ప్రత్యామ్నాయం కాంగ్రెస్‌ అని గుర్తించారు. రాష్ట్రంలో అవినీతిని నిలువరించేందుకు బీజేపీలో చేరామన్నారు. బీజేపీ సిద్ధాంతాలను ఆకర్షితులై ఆ పార్టీలో చేరలేదు. బీఆర్ఎస్ అవినీతిలో బీజేపీ నేతలు భాగస్వాములని గ్రహించి వెనక్కి వస్తున్నారు. కాంగ్రెస్‌లో తిరిగి చేరే నేతలను సాదరంగా ఆహ్వానించి తగిన హోదా ఇస్తాం.” అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Latest Articles

టిబిజెడ్ -ది ఒరిజినల్ స్టోర్ ను ప్రారంభించిన పాయల్ రాజ్ పుత్

హైదరాబాద్, 24 ఏప్రిల్, 2025: చరిత్ర, సంస్కృతి మరియు విలాసాలను మిళితం చేసే ఒక ముఖ్యమైన సందర్భంలో భాగంగా, భారతదేశంలో అత్యంత గౌరవనీయమైన ఆభరణాల బ్రాండ్ అయిన టిబిజెడ్ -ది ఒరిజినల్, నేడు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్