24.2 C
Hyderabad
Tuesday, December 2, 2025
spot_img

స్పీడ్ పెంచిన బీఆర్ఎస్.. ప్రగతి భవన్‌లో కీలక సమావేశం

స్వతంత్ర వెబ్ డెస్క్: తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార బీఆర్ఎస్ పార్టీ స్పీడ్ పెంచింది. ప్రతిపక్షాల అంచనాలకు మించి వ్యూహప్రతివ్యూహాలు పన్నుతోంది. ఇవాళ ప్రగతి భవన్‌లో కీలక సమావేశం జరుగనుంది. సీఎం కేసీఆర్‌తో మంత్రులు కేటీఆర్, హరీష్ రావు భేటీ కానున్నారు. ఈ భేటీలో పార్టీ మేనిఫెస్టో, అసమ్మతుల బుజ్జగింపులు, సభల నిర్వహణపై చర్చించనునున్నారు. ఇంకా అభ్యర్థులను ప్రకటించని చోట్ల నేతలను ఫైనల్ చేయనున్నారు. ఈసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని గట్టి సంకల్పంతో ఉన్నారు గులాబీ బాస్ కేసీఆర్. మరోవైపు సీఎం కేసీఆర్‌ బహిరంగ సభల కోసం భారీ ఏర్పాట్లు చేస్తోంది బీఆర్‌ఎస్‌. ఈనెల 15, 16న హుస్నాబాద్‌, జనగామ, భువనగిరిలో కేసీఆర్‌ పర్యటిచంనున్నారు. 17వ తేదీన సిద్దిపేట, సిరిసిల్లలో జరిగే బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు. ఈ నేపథ్యంలో అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్