స్వతంత్ర వెబ్ డెస్క్: స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం అయ్యింది. తమ నేత అరెస్టుని టీడీపీ శ్రేణులు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీకి పెద్దదిక్కుగా ఉన్న చంద్రబాబును జగన్ ప్రభుత్వం కక్షపూరితంగా జైల్లో పెట్టిందంటూ తమ ఆవేదన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వైజాగ్ ఎయిర్పోర్టులో ఓ టీడీపీ కార్యకర్త హల్చల్ చేశాడు. హైదరాబాద్ నుంచి విశాఖపట్నంకు ఇండిగో విమానంలో వచ్చిన అడారి కిషోర్ కుమార్ అనే టీడీపీ అభిమాని చంద్రబాబు అరెస్ట్పై తనదైన శైలిలో నిరసన తెలిపాడు. చంద్రబాబు అరెస్టును ఖండిద్దామంటూ పిలుపు నిచ్చాడు. సేవ్ డెమొక్రసీ అంటూ విమానంలోనూ, వైజాగ్ ఎయిర్పోర్టులోనూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశాడు. ఎయిర్పోర్టు బయట కూడా అతడు బిగ్గరగా అరుస్తుండటంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు.
వైజాగ్ ఎయిర్ పోర్టులో టీడీపీ అభిమాని హల్చల్..!
0
317
Previous article
Next article
Latest Articles
భారత్లో తెలంగాణ అంతర్భాగమే.. రావొద్దని చెప్పడానికి మీరెవరు? తెలంగాణలో జనసేన పోటీ -పవన్ కళ్యాణ్
తెలంగాణపై తనకున్న ప్రేమ రాజకీయలకు అతీతమని.. తెలంగాణ బాగుండాలని కోరుకునే వ్యక్తినని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. జూబ్లిహిల్స్లోని తన నివాసంలో ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు. తెలంగాణ గడ్డపై పుట్టింది జనసేన...
- Advertisement -
- Advertisement -


