25.2 C
Hyderabad
Tuesday, October 3, 2023
spot_img

చంద్రబాబు అరెస్ట్‌పై స్పందించిన మంత్రి కేటీఆర్‌!

స్వతంత్ర వెబ్ డెస్క్: తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు.. ఏపీలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై తాజాగా స్పందించారు. ఏపీలో జరుగుతున్న దానికి తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మీడియా మిత్రులు చంద్రబాబు అరెస్ట్‌, ప్రస్తుతం ఏపీలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై కేటీఆర్‌కు ప్రశ్నలు సంధించారు. వాటికి కేటీఆర్‌ సమాధానం ఇస్తూ.. ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకుంటున్న వాటి గురించి మాట్లాడటానికి ఏమీ లేదని అన్నారు.

ఏపీలో జరుగుతున్న దానికి తమకు ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పారు. కాగా, చంద్రబాబు 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ కోసం రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్నారు. చంద్రబాబుకు జైలులో భద్రత లేదంటూ, ఆయన్ని హౌస్‌ కస్టడీకి ఇవ్వాలని లూథ్రా ఏసీబీ కోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్‌పై సుధీర్ఘ విచారణ జరిపిన కోర్టు.. సీఐడీ వాదనలతో ఏకీభవించింది. చంద్రబాబు హౌస్‌ కస్టడీ పిటిషన్‌ను కొట్టి వేసింది.

దీంతో ఆయన మళ్లీ జైలులోనే ఉండాల్సి వస్తోంది. చంద్రబాబు భద్రత విషయంలో జైలు అధికారులు కట్టుదిట్టుమైన ఏర్పాట్లు చేశారు.  జైలులో ఆయనకంటూ ఓ ప్రత్యేక గదిని కేటాయించారు. ఇంటినుంచి భోజనం తెప్పించుకోవటానికి అనుమతి ఇస్తున్నారు. ఇక, ఈ మధ్యాహ్నం నారా భువనేశ్వరి, లోకేశ్‌, బ్రాహ్మణిలు చంద్రబాబును జైలులో కలిశారు. కొద్దిసేపు ఆయనతో మాట్లాడారు. అనంతరం అక్కడినుంచి ఇంటి బాటపట్టారు.

Latest Articles

నేడు తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన.. ఆసక్తికరంగా మారిన ప్రసంగం

స్వతంత్ర వెబ్ డెస్క్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు(మంగళవారం) తెలంగాణలో పర్యటించనున్నారు. కర్ణాటక రాష్ట్రం బీదర్ నుంచి నిజామాబాద్ జిల్లాకు రానున్నారు. జిల్లాలో రూ.8 వేల కోట్ల విలువైన పనులకు వర్చువల్‌ విధానంలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనంతరం...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
289FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్