28.2 C
Hyderabad
Saturday, January 17, 2026
spot_img

మా వాళ్లతో జాగ్రత్తగా ఆడండి… భారత జట్టుకు షోయబ్ అక్తర్ వార్నింగ్

స్వతంత్ర వెబ్ డెస్క్: ఆసియాకప్‌లో భాగంగా నేటి మధ్యాహ్నం మూడు గంటలకు భారత్-పాకిస్థాన్ జట్లు తలపడుతున్నాయి. ప్రపంచమంతా ఈ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. గ్రూప్ దశలో ఈ రెండు జట్ల మధ్య పోటీ వర్షం కారణంగా ఫలితం తేలకుండానే ముగిసిపోవడంతో ఇప్పుడందరూ ఈ మ్యాచ్ కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మ్యాచ్ జరగనున్న కొలంబోలో నేడు వర్షం పడే అవకాశం కూడా ఉంది. ఒకవేళ అదే జరిగితే రిజర్వు డే అయిన రేపు మ్యాచ్‌ను కొనసాగిస్తారు.

ఈ మ్యాచ్‌ కోసం పాకిస్థాన్ లెజెండరీ పేసర్ షోయబ్ అక్తర్ కొలంబో చేరుకున్నాడు. వచ్చీ రావడమే ‘ఎక్స్’లో వీడియో పోస్టు చేశాడు. తాను కొలంబో చేరుకున్నానని, వాతావరణం బాగానే ఉందని పేర్కొన్నాడు. చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ ఇక్కడ అడుగుపెట్టానని పేర్కొన్నాడు. గొప్ప దేశం, గొప్ప ప్రజలు అని కొనియాడాడు. అంతేకాదు, ‘‘పాకిస్థాన్‌తో జాగ్రత్త’’ అని ఓ హెచ్చరిక కూడా జారీ చేశాడు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్