స్వతంత్ర వెబ్ డెస్క్: కాంగ్రెస్ స్టార్ క్యాపెయినర్, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komati Reddy) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సారి తెలంగాణలో కాంగ్రెస్(Congress) పార్టీదే విజయమని.. సర్వేలన్నీ ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ చాలా స్ట్రాంగ్గా ఉందని.. గెలుస్తుందన్న నమ్మకం ప్రతీ ఒక్కరిలో బలంగా ఉందన్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్(Brs) సర్కారుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
మొన్నటివరకు కురిసిన భారీ వర్షాలకు పంట నష్టం జరిగితే ఒక్క రూపాయి ఇవ్వలేదని మండిపడ్డారు. తమ ప్రభుత్వం వచ్చాక ఉద్యోగాలు పారదర్శకంగా ఇస్తామని ప్రకటించారు. 5 లక్షల మంది టీఆర్టీ కోసం ఎదురుచూస్తున్నారని… కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 2, 3 నెలల్లోనే నోటిఫికేషన్ ఇస్తామన్నారు. గ్రామ పంచాయతీలకు కూడా నిధులు ఇవ్వడం లేదని కోమటిరెడ్డి ఆరోపించారు. విచ్చలవిడిగా భూములు అమ్మేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
50 వేల కోట్లు కేవలం మద్యం అమ్మకాలపైనే వస్తున్నాయని.. ఆ పైసలన్నీ ఎటుపోతున్నాయంటూ ప్రశ్నించారు. . 24 గంటల కరెంట్పై ప్రభుత్వం చెప్పేవన్ని అబద్ధాలని వెల్లడించారు. లాగ్ బుక్స్తో అన్నీ బయటపెట్టానని పేర్కొన్న కోమటిరెడ్డి.. మరోసారి సబ్స్టేషన్ దగ్గర ధర్నాకు దిగుతా.. దెబ్బకు కేసీఆర్ దిగి రావాలంటూ సవాల్ విసిరారు.