20.9 C
Hyderabad
Monday, September 29, 2025
spot_img

Suryapeta: మై హోమ్ సిమెంట్ ఫ్యాక్టరీలో ప్రమాదం.. ఐదుగురు మృతి

స్వతంత్ర వెబ్ డెస్క్: సూర్యాపేట జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మేళ్ల చెరువులోని మై హోం సిమెంట్ ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగింది. కాంక్రీట్ వర్క్ చేస్తుండగా లిఫ్ట్ కూలిపోయి కింద పడటంతో ఐదుగురు కార్మికులు మృతి చెందినట్లు తెలుస్తోంది. మరికొందరికి ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలవ్వగా.. క్షతగాత్రులను చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి పోలీసులు తరలిస్తున్నారు. ఒక్కసారిగా కంపెనీలో ప్రమాదం జరగడంతో కార్మికులు ఉలిక్కిపడ్డారు.

ప్రమాదం గురించి సిబ్బంది నుంచి సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయకచర్యలను చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి అంబులెన్స్‌లలో తరలించారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రిలో చేర్పించారు. ప్లాంట్ ఎగువ భాగంలో లిఫ్ట్ కూలడంతో 600 అడుగుల ఎత్తు నుంచి కార్మికులు కిందపడి మృతి చెందినట్లు సమాచారం. ముగ్గురు మృతదేహాలను శిథిలాల నుంచి వెలికితీయగా.. మరో ఇద్దరి మృతదేహాలను బయటకు తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మరికొంతమంది లోపల చిక్కుకుపోయారు.

బాధితులు యూపీ, బీహార్‌కు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. పోలీసులు ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. ఈ సిమెంట్ ఫ్యాక్టరీలో నూతనంగా నిర్మిస్తున్న యూనిట్ -4 వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంటున్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా ఈ యూనిట్‌ను నిర్మిస్తున్నారు. అయితే అనుమతి లేకుండా ఈ యూనిట్ నిర్మాణం చేపడుతున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ ప్రమాదంపై మై హోం యాజమాన్యం గోప్యత పాటిస్తోంది. వివరాలు ఏమీ బయటకు చెప్పడం లేదు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్