స్వతంత్ర, వెబ్ డెస్క్: ఢిల్లీ పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. షాతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. ఏపీ, తెలంగాణలో తాజా రాజకీయ పరిస్థితులు, పొత్తులపై చర్చించినట్లు తెలుస్తోంది. రేపు ప్రధాని మోదీతోనూ చంద్రబాబు భేటీ కానున్నట్లు సమాచారం. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీలో బీజేపీ-టీడీపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తామని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా చంద్రబాబు బీజేపీ పెద్దలను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీల అనంతరం పొత్తులపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
అమిత్ షాతో చంద్రబాబు భేటీ.. పొత్తులపై చర్చ!
0
278
Previous article
Next article
Latest Articles
చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో కుక్క మృతి
కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో కీలక ఆధారంగా భావించిన పెంపుడు కుక్క మృతి చెందడం కొత్త చర్చకు దారితీసింది. చిన్నారి కనిపించకుండా పోయిన రోజు ఆమెతో పాటు...
- Advertisement -
- Advertisement -


