రైతులతో కలిసి ట్రాక్టర్ నడిపిన సీఎం జగన్

స్వతంత్ర, వెబ్ డెస్క్: వైఎస్సార్ యంత్ర సేవా పథకం రెండో విడత మెగా మేళాను సీఎం జగన్ ఇవాళ ఉదయం గుంటూరులో ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రూ. 361.29 కోట్లు విలువచేసే 2,562 ట్రాక్టర్లు, 100 కంబైన్ హార్వెస్టర్లను రైతులకు ఆయన పంపిణీ చేశారు. అంతేకాకుండా 13,573 ఇతర వ్యవసాయ పనిముట్లను కూడా అందజేశారు. అనంతరం రైతులతో కలిసి కాసేపు సరదాగా ట్రాక్టర్ తోలారు.

అనంతరం బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ.. రైతులు అన్ని విధాలుగా అభివృద్ధి చెందడమే తన లక్ష్యమని. అన్నదాతలకు అండగా నిలిచి గ్రామ స్వరాజ్యం తీసుకొచ్చామని పేర్కొన్నారు. ఇందుకోసం వైఎస్సార్‌ యంత్ర సేవా పథకం తీసుకొచ్చామన్నారు. అలాగే ప్రతీ ఆర్బీకే పరిధిలో తక్కువ ధరకు యంత్ర పనిముట్లు అందజేస్తున్నామని పేర్కొన్నారు. వచ్చే అక్టోబర్‌లో 7లక్షల మందికి లబ్ధి చేకూరేలా యంత్రాలు అందిస్తామని జగన్ వెల్లడించారు.

Latest Articles

కళ్యాణ్ రామ్.. ప్లాప్ డైరెక్టర్ కి ఓకే చెప్పాడా..?

నందమూరి కళ్యాణ్ రామ్.. బింబిసార మూవీతో బ్లాక్ బస్టర్ సాధించిన తర్వాత చేసిన సినిమాలు ఏమాత్రం ఆకట్టుకోలేదు. ఇప్పుడు వెంకీతో కలిసి హిట్ మిషన్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో.. చేస్తున్న క్రేజీ మల్టీస్టారర్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్