ఆంధ్రప్రదేశ్ లోని కర్నూల్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేతం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. స్వామి వారి దర్శనం కోసం 15 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 63,443 మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే 23,761 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. కాగా, శుక్రవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.8 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.