35.2 C
Hyderabad
Thursday, May 7, 2026
spot_img

సూర్యాపేట జిల్లా ఇమాంపేటలో విషాదం

    సూర్యాపేట జిల్లా ఇమాంపేట గురుకుల బాలికల కళాశాలలో మరో దారుణం చోటుచేసుకుంది. ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న దగ్గుపాటి వైష్ణవి హాస్టల్ గదిలో ఉరేసుకొని అనుమానస్పద స్ధితిలో మృతి చెందింది. శనివారం కళాశాల ప్రాంగణంలో జరిగిన ఫేర్వెల్ పార్టీలో ఉత్సాహంగా పాల్గొన్న వైష్ణవి….హస్టల్‌ గదిలో ఆత్మహత్య చేసుకుంది. వైష్ణవి మృతదేహాన్ని సూర్యాపేట ఏరియా ఆస్పత్రి మార్చురీలో వదిలేసి హాస్టల్ సిబ్బంది హడావుడిగా పారిపోయ్యరాని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. తమ బిడ్డ చనిపోయేంత బలమైన కారణం లేదని… తన బిడ్డను హాస్టల్ నిర్వాహకులు హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని వైష్ణవి తల్లిదండ్రులు ఆరోపించారు. వైష్ణవి మృతికి కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నారు.

Latest Articles

కాకినాడ ఎంపీకి టైం ఎప్పుడు దొరుకుతుంది?

ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో ఇప్పుడు సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. తనకున్న రాష్ట్ర స్థాయి బాధ్యతల వల్ల పవన్ కళ్యాణ్ స్థానికంగా ఉండలేకపోవడంతో.....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్