విశాఖలో అర్థరాత్రి రెచ్చిపోయిన ల్యాండ్‌ మాఫియా

        విశాఖ జిల్లా మధురవాడలోని కొమ్మాదిలో ఇంటి సమీపంలోనే తహసీల్దార్‌ దారుణ హత్యకు గురయ్యాడు. విశాఖ రూరల్‌  తహసీల్దార్‌గా ఉన్న సనపల రమణయ్య ఎన్నికల నేపథ్యంలో ఇటీవల విజయనగరం జిల్లాలోని బంటుపల్లి కి బదిలీ అయ్యాడు. కొమ్మాదిలోని ఓ అపార్ట్‌మెంట్‌ ఐదో అంతస్తులో నివాసం ఉండే ఆయన.. శుక్రవారం బాధ్యతలు చేపట్టి ఇంటికి చేరుకున్నాడు. రాత్రి 10 గంటల ప్రాంతంలో ఫోన్‌ రావడంతో కిందకు వచ్చి అపార్ట్‌మెంట్‌ గేట్‌ వద్ద ఓ వ్యక్తిని కలిసినట్లు సీసీటీవీ ఫుటేజ్‌లో నమోదైంది. ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో దుండగుడు ఇనుపరాడ్‌తో తహసీల్దార్‌పై ఒక్కసారిగా దాడి చేసి పరారయ్యాడు. తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే రమణయ్య కుప్పకూలిపోయాడు. గమనించిన వాచ్‌మెన్‌ కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. దాడికి గల కారణాలపై ఆరా తీసున్నారు. మరోవైపు, తహసీల్దార్‌ హత్యతో రెవెన్యూ యంత్రాంగం ఉలిక్కిపడింది.

Latest Articles

ఫౌజీ వస్తున్నాడు.. మరి.. బాలయ్య..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ, క్రేజీ మూవీ ఫౌజీ. హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అనేది ఇన్ని రోజులు సస్పెన్స్ గా ఉండేది. ఇప్పుడు డిసెంబర్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్