యాదగిరిగుట్ట పేరును మార్చడమే కేసీఆర్ చేసిన మొదటి తప్పని అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. త్వరలో యాదగిరిగుట్టగా పేరు మారుస్తామన్నారాయన. కేసీఆర్ చేసిన పాపాల వల్ల కరువు వచ్చిందని ఆరోపించారు. దేవుడి పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి సర్వనాశనం చేశారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుంటే కేసీఆర్కు మైండ్ బ్లాక్ అయిందని .. అందుకే ఏదేదో మాట్లాడుతున్నారని చెప్పారు. తెలంగాణలో BRS లేదు..అందుకే టికెట్ ఇచ్చినా వద్దని నేతలు బయటకు వస్తున్నారని వ్యాఖ్యానించారు. తాము గేట్లు తెరవడం కాదు… తమ పార్టీ గేట్లు పలగొట్టి పార్టీలో జాయిన్ అవుతున్నారని కోమటిరెడ్డి అన్నారు. కేసీఆర్ చేసిన పాపాలే ఇప్పుడు ఆయన్ను చుట్టుకున్నాయని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీలో ఒక్కరూ మిగలరని కోమటిరెడ్డి అన్నారు.పార్టీ ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళ కోసం పనిచేస్తానన్నారు కోమటిరెడ్డి. ఒక్క తెలంగాణ కోసం తప్ప తాను ఎప్పుడూ పార్టీని వ్యతిరేకించలేదన్నారు. టికెట్ల విషయంలో కలుగజేసుకోననన్న మంత్రి.. పార్టీ కోసం పనిచే స్తానని చెప్పారు. తన నియోజకవర్గం…శాఖ తప్ప వేరే విషయాలను పట్టించుకోవడం లేదని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. .