ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేన పార్టీకి షాకులు తగులుతున్నాయి. అభ్యర్థుల ఎంపికలో సీట్లు దక్కని నేతలు.. అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీని వీడి వేరేపార్టీలోకి వలస వెళుతున్నారు. ఈ క్రమంలోనే మరో కీలక నేత జనసేనకు షాకిచ్చారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం జనసేన సమన్వయకర్త పితాని బాలకృష్ణ.. ఆ పార్టీకి రాజీనామా చేశారు. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరతా నని ఆయన ప్రకటించారు. అయితే పవన్ కళ్యాణ్ కనీసం తనను కలిసే అవకాశం కూడా ఇవ్వలేదని పితాని బాలకృష్ణ ఆరోపించారు.