దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రం తెలంగాణ అని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. 25 సంవత్సరాల్లో ఇది సాధ్యమైందని తెలిపారు. ఏం చేయాలన్నా ఒక దూరదృష్టి,ఒక నిర్దిష్టమైన ఆలోచన ఉండాలని తెలిపారు. హైదరాబాద్లోని HICCలో ప్రపంచ తెలుగు మహాసభలకు హాజరై, కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలుగువారు ఎక్కడున్నా రాణిస్తున్నారని సీఎం అన్నారు. 1996లో ఐటీకి ప్రాధాన్యత ఇచ్చానని గుర్తు చేశారు. ఐటీ తిండి పెడుతుందా అని అప్పట్లో ఎంతో మంది హేళన చేశారని తెలిపారు. సెల్ ఫోన్లు ప్రమోట్ చేస్తే.. ఏమన్నా ఉపయోగమా? అని ప్రశ్నించారు. కానీ ఈరోజు నాలెడ్జ్ ఎకానమీలో తెలుగువారు దూసుకెళ్తున్నారని తెలిపారు. భవిష్యత్ లో జరగబోయే విషయాలను మనం ముందుగానే ఆలోచించాలన్నారు. తగిన విధంగా ముందుకు వెళ్లగలిగితే ఏదైనా సాధ్యమేనని సీఎం చంద్రబాబు తెలిపారు.
ఏం చేయాలన్నా ఒక దూరదృష్టి ఉండాలి- సీఎం చంద్రబాబు
0
221
Latest Articles
జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -
- Advertisement -


