గుంటూరు జిల్లా మంగళగిరిలో నారా లోకేష్‌ పర్యటన

గుంటూరు జిల్లా మంగళగిరిలో లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ముఖద్వారాన్ని ప్రారంభించారు మంత్రి నారా లోకేష్‌. వేద పండితుల సమక్షంలో అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దక్షిణ భారతదేశంలోనే అత్యంత పురాతనమైన ఈ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి రాష్ట్రవ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా భక్తులు విచ్చేస్తూ ఉంటారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంగళగిరి దేవస్థానానికి అత్యంత ప్రాధాన్యతను ఇచ్చి ఆలయ అభివృద్ధికి సహకరిస్తున్న నేపథ్యంలో.. ఓ దాత నిర్మించిన ఆల‌య ముఖ‌ద్వారాన్ని లోకేష్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంగళగిరి అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని.. మంగళగిరిని ఆదర్శ నియోజవర్గంగా తీర్చిదిద్దాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు నారా లోకేష్‌.

Latest Articles

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పెరుగుతున్న సీనియర్ల అసంతృప్తి

తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సొంత నేతల నుంచే తీవ్ర స్థాయి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒకవైపు ప్రతిపక్షాల విమర్శలను దీటుగా ఎదుర్కొంటున్న ప్రభుత్వానికి, అంతర్గతంగా సీనియర్ నాయకుల అసంతృప్తి వ్యవహారం పెద్ద...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్