అన్ స్టాపబుల్ 2: బాలకృష్ణతో పవన్ కల్యాణ్
Unstoppable2 with nbk pawan kalyan episode2:
నటసింహం బాలకృష్ణ ‘అన్ స్టాపబుల్-2’ టాప్ ట్రెండింగ్ లో ఉందనే సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఇంకా ట్రెండింగ్ లో నడుస్తున్న పవన్ కల్యాణ్ ‘రెండో ఎపిసోడ్ ఎప్పుడెప్పుడా అని ప్రజలంతా ఎదురుచూశారు. దానికి ఒక కారణం ఉంది. అదేమిటంటే…
‘‘అన్నయ్య పిస్టల్ తో కాల్చుకుని చనిపోదామని అనుకున్నా’’ అని పవన్ కల్యాణ్ చెప్పిన దానిని ప్రోమోగా విడుదల చేసేసరికి అందరిలో క్యూరియాసిటీ పెరిగిపోయింది.


‘‘ఎందుకలా…అన్నాడు…ఎందుకలా అన్నాడు’’ అని అందరిలో ఆతృత పెరిగిపోయింది. ఎట్టకేలకు రెండో పార్ట్ వచ్చింది. ఇంతకీ విషయం ఏమిటంటే,
పరీక్షల్లో ఒత్తిడి భరించలేకపోయేవాడిని, అన్నింటిలో ఫెయిల్ అవుతూ వెళుతున్నాను. నా ఫ్రెండ్స్ అందరూ మంచి పొజిషన్లలో ఉండేవారు. వారితో పోటీ పడలేకపోయేవాడిని…దాంతో ఆత్మనూన్యతా భావం పెరిగిపోయింది.
ఎవరితో కలిసే వాడిని కాను. దానికితోడు నాకు సిగ్గు, మొహమాటం ఎక్కువ. దాంతో ఒక్కడినే ఒక్క రూమ్ లో ఉండిపోయాను. అప్పుడే పుస్తకమే నాకు స్నేహితుడైంది. దాంతో ప్రపంచ జ్నానం పెరిగిందని తెలిపారు.
ఈ క్రమంలోనే ఒకరోజు అన్నయ్య పిస్టల్ తో కాల్చుకుని చనిపోదామని అనుకున్నాను. కానీ మనసు మార్చుకున్నాను. ఇంతలో నాగబాబు, మా వదిన వచ్చి ఏంటి అలా ఉన్నావని అడిగారు.

అన్నయ్య పిస్టల్ తో కాల్చుకుని చనిపోదామని అనుకున్నాను అని చెప్పాను. దాంతో అన్నయ్య దగ్గరకి నన్ను తీసుకెళ్లారు. అప్పుడు మా అన్నయ్య, నువ్వు చదవకపోయినా పర్వాలేదు…బతికి ఉండరా! అని చెప్పారు. ఇంకెప్పుడూ ఆ ఆలోచన నాకు రాలేదని తెలిపాడు.
ఇదీ పవన్ కల్యాణ్ పిస్టల్ వెనుక కథ…అయితే మీ అన్నయ్య దగ్గర నుంచి నువ్వేం నేర్చుకున్నావ్ అని బాలకృష్ణ అడిగితే…మొదట ‘ఎలా మాట్లాడాలో తెలుసుకున్నాను. రెండు మొహమాటం ఉండకూడదని గ్రహించాను’ అని చెప్పుకు వచ్చారు.
రాజకీయాల గురించి మాట్లాడుతూ రాత్రికి రాత్రే అద్భుతాలు జరుగుతాయని నేను అనుకోవడం లేదు. నేను వాస్తవంలోనే ఉన్నానని అన్నారు. నా సభలకి వచ్చే ప్రజలు, ఫ్యాన్స్…నుంచి ఓట్ల రూపంలో రావడం లేదు. ఆ సంగతి నాకు తెలుసు. అయితే ప్రజలపై నాకు నమ్మకం ఉంది. నాపై ప్రజలకు నమ్మకం కలగాలి. అందుకోసం నేను కష్టపడుతున్నాను అని అన్నారు.
అధికారంలోకి వస్తానా? రానా? అనేది తర్వాత విషయం. ముందు ప్రజలకు చెప్పాలనుకున్నవి…నా నోటి నుంచి చెబితే, అది వేగంగా వెళుతుంది. వారికి ఏదో ఒక మంచి చేయాలనేది నా లక్ష్యం. అందుకోసం మొదట నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ బాధితుల కోసం ఏదొకటి చేద్దామని అనుకున్నాను. రాజకీయ కారణాలతో ఇబ్బందులు పెట్టడంతో చేయలేకపోయాను.

తర్వాత ఎన్జీవో పెడదామని అనుకున్నా…నా ఆలోచనలకు అది సరిపోదని భావించి రాజకీయ పార్టీ పెట్టానని తెలిపారు. తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలో చేరితే, అప్పటికే వాళ్లకి ఉన్న సిద్ధాంతాలు వేరు, నేను అనుకున్న సిద్ధాంతాలు వేరు అందుకే కలవలేకపోయానని చెప్పుకొచ్చారు.
ఇప్పుడున్న వైసీపీ పార్టీ నేతలు రీవెంజ్ తీసుకుంటున్నారు. నేను ఒక సభకి వెళ్లకూడదు, కారుపై టాప్ మీద కూర్చోకూడదు, కనీసం చేతులు కూడా ఊపకూడదు, హోటల్ నుంచి బయటకు రాకూడదు…ఇన్ని నిర్భందాలా? అందుకే నా సభ కోసం ‘ఇప్పటం’ ప్రజలని ఇబ్బంది పెడితే, వారిని చూసేందుకు ధైర్యం చేసి వెళ్లాను. ఇది నా నిరసన వ్యక్తం చేయడం మాత్రమేనని అన్నారు.
సినిమాల్లో స్టార్ డమ్ రాజకీయాల్లో వస్తుందని అంటారు. అది ఎన్టీఆర్, ఎంజీఆర్ కి మాత్రమే వచ్చింది. అది అందరికీ సాధ్యం కాదని తెలిపారు. నాకూ రెండు దశాబ్ధాల సమయం పడుతుందని అనుకుంటున్నాను అని అన్నారు.
చివరగా బాలకృష్ణ గురించి పవన్ కల్యాణ్ మాట్లాడుతూ ముక్కుసూటిగా మాట్లాడతారు. ఏ కల్మషం లేని వ్యక్తి అని తెలిపారు. బాలకృష్ణ గారిపై ముందు నాకెలాంటి అభిప్రాయం ఉందో, ఇప్పుడూ అలాగే ఉంది. ఈ షోకి తగిన వ్యక్తి ఆయన అని అన్నారు.
చివరిగా బాలకృష్ణ కూడా పవన్ కల్యాణ్ కి కొన్ని సూచనలు చేశారు. మనసులో తట్టుకోలేని ఆవేశం, బాధ, కోపం వచ్చినప్పుడు కుటుంబ సభ్యులు, స్నేహితులు, భార్యతో షేర్ చేసుకోమని సలహా ఇచ్చారు. సిగ్గుపడొద్దు అని తెలిపారు. ఎవరేమనుకుంటారోనని అనుకోవద్దు. ఒకొక్కసారి దారినపోయే దానయ్య ఇచ్చే సలహా కూడా మన జీవితాన్నే మార్చేస్తుంది అని హితబోధ చేశారు.
చివరగా ట్విస్ట్ ఏమిటంటే, పవన్ కల్యాణ్ కి సలహా చెప్పే స్థాయి, ధైర్యం ఒక్క బాలయ్యకే ఉందని అభిమానులు అంటున్నారు. అందుకే జై బాలయ్యా అని కామెంట్లు కూడా పెడుతున్నారు.