జగిత్యాల జిల్లా మద్దుట్లలో విషాదం చోటుచేసుకుంది. స్కూల్ వ్యాన్ క్రింద పడి రెండేళ్ల అరిబా అనే చిన్నారి మృతి చెందింది. తన సోదరుడిని స్కూల్ బస్సు ఎక్కించడానికి అరిబా తన తల్లితో కలిసి వెళ్లింది. తన సోదరుడిని తల్లి బస్సు ఎక్కించడానికి వెళ్తుండగా వెనకాలే చిన్నారి వెళ్లింది. గమనించని వ్యాను డ్రైవర్ బస్సును కదిలించడంతో టైర్ల క్రింద పడి మృతి చెందింది. చిన్నారి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.