Free Porn
xbporn
24.7 C
Hyderabad
Saturday, July 27, 2024
spot_img

కాంగ్రెస్, బీజేపీ మధ్య టఫ్ ఫైట్

   దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. మొదటవిడత పోలింగ్ కూడా ముగిసింది. మిగిలిన ఆరు దశల్లో జరిగే ఎన్నికల కోసం ఇటు ఎన్డీయే అటు ఇండియా కూటమి భాగస్వామ్యపక్షాలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. తెలంగాణలోని మొత్తం 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో మే 13న పోలింగ్ జరుగుతుంది. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ మధ్య తీవ్ర పోటీ నెలకొన్నట్లు సమాచారం అందుతోంది.

ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఇటీవల హైదరాబాద్ వచ్చి తెలంగాణ కాంగ్రెస్ నేతలకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో కనీసం 15 సీట్లు లక్ష్యంగా కాంగ్రెస్ నేతలు పనిచేయాలన్నారు. దక్షిణ భారతదేశంలో ఇండియా కూటమి స్పష్టమైన ఆధిక్యత సాధిస్తుందన్న నమ్మకం ఉందన్నారు. అంతేకాదు ఉత్తర భారతదేశంలో కూడా బీజేపీ బలహీన పడుతోందన్న వార్తలు వస్తున్నాయన్నారు కేసీ వేణుగోపాల్. తెలంగాణలో కాంగ్రెస్‌కు అనుకూల వాతావరణం ఉందని కాంగ్రెస్ అగ్రనేత వేణుగోపాల్ వెల్లడించారు. గ్యారంటీల అమలుతో ప్రజల్లో కాంగ్రెస్ పట్ల భరోసా పెరిగిందన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో నెలకొన్న సానుకూల వాతావరణాన్ని లోక్‌సభ ఎన్నికల్లో మెజారిటీ సెగ్మెంట్లు కైవసం చేసుకోవడానికి కాంగ్రెస్ నాయకులు కృషి చేయాలని వేణుగోపాల్ పిలుపునిచ్చారు. నాయకుల, కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ గులాబీ పార్టీని మునిగిపోయిన నావతో పోల్చారు కేసీ వేణుగోపాల్. భారత్ రాష్ట్ర సమితిని పట్టించుకో వాల్సిన అవసరం లేదన్నారు. బీజేపీ గురించి ప్రస్తావిస్తూ , సామాన్య ప్రజల్లో ఆ పార్టీ పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతోంద న్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి బీఆర్‌ఎస్, బీజేపీలు ఒక్కటయ్యాయని వేణుగోపాల్ ఘాటు ఆరోపణలు చేశారు. గత పదేళ్లుగా కేంద్రంలోని బీజేపీ సర్కార్ వైఫల్యాలను అలాగే గులాబీ పార్టీ దుర్మార్గాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని క్యాడర్‌కు వేణుగోపాల్ పిలుపుని చ్చారు.

   తుక్కుగూడలో తాజాగా జనజాతర సభతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ ఎన్నికల సమరశంఖం పూరించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు తుక్కుగూడలోనే కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలోనే ఆరు గ్యారంటీలను ప్రకటించి, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చింది. దీంతో తుక్కుగూడ సెంటిమెంట్ ను లోక్‌సభ ఎన్నికల్లోనూ కొనసాగించాలని హస్తం పార్టీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో తుక్కుగూడలో బహిరంగ సభ నిర్వహించి సార్వత్రిక ఎన్నికలకు సై అంది హస్తం పార్టీ.తుక్కుగూడ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా హాజరైన అగ్ర నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అమలు చేసే ఐదు గ్యారంటీల గురించి తెలంగాణ ప్రజలకు వివరించారు. అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా ఇచ్చిన హామీలను ఒక్కటొక్కటిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న విషయాన్ని రాహుల్ గాంధీ ప్రస్తావించారు. పనిలోపనిగా తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని రాహుల్ గాంధీ ప్రస్తావించారు. ఫోన్ ట్యాపింగ్ వెనుక గులాబీ పార్టీ కీలక నేతలు ఉన్నారన్నారు రాహుల్. ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్‌ను ప్రస్తావించడం ద్వారా భారత్ రాష్ట్రసమితిని ఇరుకున పెట్టారు రాహుల్ గాంధీ. అలాగే దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఎలెక్టోరల్ బాండ్లను కూడా రాహుల్ గాంధీ తన ప్రసంగంలో ప్రస్తావించారు. భారతీయ జనతా పార్టీ అవినీతికి ఎలెక్టోరల్ బాండ్లు ప్రతీ కగా మారాయన్నారు. ఈ సందర్బంగా కమలం పార్టీపై రాహుల్ గాంధీ ఘాటు విమర్శలు చేశారు.

   నాలుగు నెలల కిందట జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ జోరు మీదుంది. లోక్‌సభ ఎన్నికల్లోనూ మెజారిటీ సీట్లను గెలుచుకుంటామన్న ధీమా కాంగ్రెస్ నేతల్లో కనిపిస్తోంది. అంతేకాదు. ఇటీవల గులాబీ పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి పెద్ద ఎత్తున వలసలు ప్రారంభమ య్యాయి. నిన్నమొన్నటివరకు గులాబీ పార్టీలో అగ్రనేతలుగా ఉన్న కే.కేశవరావు, కడియం శ్రీహారి లాంటి వారు  ఇటీవల కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. లోక్‌సభ ఎన్నికలు ముగిసేసరికి బీఆర్‌ఎస్‌లో ఎవరు ఉంటారో, ఎవరు పార్టీకి గుడ్‌ బై చెబుతారోనని రాజకీయవర్గాల్లో ఇప్పటికే చర్చ మొదలైంది. అయితే ఇదంతా కాంగ్రెస్ పార్టీకి ప్లస్ పాయింట్‌గా మారుతుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అగ్ని పరీక్షగా మారాయి. నాలుగు నెలల కిందట ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి హోదాలో అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీని గెలుపుతీరాలకు చేర్చడంలో రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో మెజారిటీ సీట్లు కైవసం చేసుకునే బాధ్యతను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై పెట్టింది కాంగ్రెస్ అధిష్టానం. దీంతో మెజారిటీ సీట్ల గెలుపుకోసం రేవంత్ రెడ్డి శిబిరం తీవ్రంగా శ్రమిస్తోంది.

Latest Articles

యూఎస్ఏలో నేడు ‘పేక మేడలు’ రిలీజ్

క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి రాకేష్ వర్రే నిర్మాతగా వినోద్ కిషన్ హీరో గా అనూష కృష్ణ హీరోయిన్ గా నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో వచ్చిన సినిమా పేక మేడలు. ఉమెన్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్