ఓటేసిన వారిని కాటేసే రకం జగన్ అని కీలక వ్యాఖ్యలు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. వైసీపీ ఫ్యాన్ ముక్కలు కావడం ఖాయమని, రాష్ట్రానికి మంచిరోజులు రాబోతున్నాయని తెలిపారు. జగన్ రాష్ట్రా నికి పట్టిన క్యాన్సర్ గడ్డ అని విమర్శించారు. కరెంట్ చార్జీలతోపాటు అన్ని పెంచేశారని, జగ్గుబాయ్ బ్రాండ్తో ప్రజల ప్రాణాలు తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. మద్యం డబ్బంతా తాడేపల్లి ప్యాలెస్కు పోతోందని తెలిపారు. ఉద్యోగాలు లేక యువత రోడ్డుపడుతోందని జాబు కావాలంటే బాబు రావాలని చంద్రబాబు స్పష్టంచేశారు.