ఏపీలో పొత్తులు ఖరారయ్యాయి. ఎవరికి ఎన్నెన్ని సీట్లో లెక్కలు తేలాయి. ఇక అభ్యర్థుల ఖరారుపై దృష్టి పెట్టాయి. ఇప్పటికే మొదటి విడత జాబితాలో అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ.. సెకండ్ లిస్ట్పై దాదాపు కసరత్తు పూర్తయింది. ఈనెల 14న రెండో జాబితా విడుదల చేసేందుకు సన్నాహాలు పూర్తి చేసింది. రెండో విడతలో 20 నుంచి 25 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే చాన్స్ ఉంది. ఏడెనిమిది లోక్సభ అభ్యర్థులను కూడా ప్రకటించనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. పొత్తుతో ఎన్నికలకు వెళ్తున్న జనసేన కూడా రెండో విడత జాబితాను విడుదల చేయనుంది. సుమారు ఆరేడు అసెంబ్లీ స్థానా లకు అభ్యర్థులను ప్రకటించనున్నారు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్.