సెమీ హైస్పీడ్ రైలుగా పట్టాలపైకి ఎక్కిన వందేభారత్ రైళ్లపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. దేశంలో ఏదో ఒక చోట గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడులు చేస్తూనే ఉన్నారు. తాజాగా తెలుగు రాష్ట్రాల మధ్య నడిచే సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైలుపై గూడూరు సమీపంలో రాళ్ల దాడి జరిగింది. కొందరు దుండగులు వేగంగా దూసుకెళ్తున్న రైలుపై రాళ్లు విసిరారు. ఈ దాడిలో రైలు బోగీ అద్దం పగిలినట్లు తెలుస్తోంది. ఈ మేరకు రేణిగుంట పోలీసులకు రైల్వే సిబ్బంది ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు మోదు చేసుకున్న పోలీసులు దాడికి పాల్పడిన వారి కోసం గాలిస్తున్నారు. కాగా సికింద్రాబాద్-విశాఖ వందేభారత్ రైలుపై కూడా పలుమార్లు రాళ్ల దాడి జరిగింది.
వందేభారత్ రైలుపై గూడూరులో రాళ్ల దాడి
0
299
Previous article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


