స్వతంత్ర, వెబ్ డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం లాభాలతో ముగింపు పలికాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 99.08 పాయింట్లు లాభపడి 62,724.71 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 38.10 పాయింట్ల లాభంతో 18,601.50 దగ్గర స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 82.43గా నిలిచింది. టీసీఎస్, హెచ్సీఎల్, ఎంఅండ్ఎం, నెస్లే ఇండియా, సన్ఫార్మా, భారతీ ఎయిర్టెల్, ఏషియన్ పేయింట్స్, టాటా మోటార్స్, కోటక్ మహీంద్రా బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు షేర్లు లాభాల బాటలో పయనించగా. విప్రో, ఐటీసీ, టైటాన్, ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, పవర్ గ్రిడ్, మారుతీ షేర్లు నష్టపోయిన జాబితాలో ఉన్నాయి.