స్వతంత్ర, వెబ్ డెస్క్: తెలంగాణ పరిపాలనకు గుండెకాయ అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ సచివాలయం నిత్యం సీఎం, మంత్రులు, అధికారుల హడావిడి ఉండే ప్రాంతం. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు మొదలైన నాటి నుండి.. సెక్రటరియేట్ అంతా నిశ్శబ్డంగా దర్శనమిస్తుంది. తెలంగాణ సచివాలయం మంత్రులు లేక బోసీపోతుంది. దశాబ్ది ఉత్సవాలు మొదలు.. ఒక్కరిద్దరు మినహా మంత్రులు ఎవరు సచివాలయం వైపు కన్నెత్తి చూడటంలేదు. కొత్త సచివాయలం ప్రారంభమైన కొత్తలో వరుస సమీక్షలతో… అధికారులను ఉరుకులు పెట్టించిన సీఎం, మంత్రులు… పదేళ్ల పండుగ సంబురాలలో బీజీగా ఉండి జిల్లాలకే పరిమితం అవడంతో సచివాలయం వెలవెలబోతుంది.
జూన్ 2 న సచివాలయం వేదికగా… సీఎం కేసీఆర్ తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా ప్రారంబించారు. ఆ కార్యక్రమంలో సీఎం తోపాటు కొందరు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు మాత్రమే పాల్గొన్నారు. ఇక మంత్రులు అందరు కూడా వారి వారి జిల్లాల్లో దశాబ్ది వేడుకలను ప్రారంబించారు. ఇక నాటి నుండి నేటి వరకు మంత్రులు అందరు జిల్లాలకే ఫరిమతం అయ్యారు. దశాబ్ది ఉత్సవాలలోని షెడ్యూల్డ్ కార్యాక్రమాలలో బిజిబిజిగా ఉన్నారు. నియోజవర్గాల్లో కార్యాక్రమాల్లో ప్రజలతో కలిసి పాల్గొంటున్నారు. వారంతా రాత్రికి హైదరాబాద్ కు వస్తున్నప్పటికి… సచివాలయం వైపు మాత్రం ఏ ఒక్క మంత్రి రావడం లేదు. కేవలం తమ జిల్లా, నియోజవర్గాలకే ఫరిమితం అవతున్నారు మంత్రులు.