నేపాల్లో బస్సు నదిలోకి దూసుకెళ్లిన ఘటనలో మృతుల సంఖ్య 41కి చేరింది. ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్కు చెందిన పర్యటక బస్సులో డ్రైవర్, ఇద్దరు సహాయకులు సహా 43 మంది నేపాల్లోని పొఖారా నుంచి కాఠ్మాండూకు బయలుదేరారు. తనహూ జిల్లాలోని అంబూ ఖైరేనీ ప్రాంతంలో వెళుతుండగా వాహనం అదుపు తప్పింది. రహదారి పక్కన 150 అడుగుల లోతున వేగంగా ప్రవహిస్తున్న మార్సయాంగడీ నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 16 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 25 మంది చికిత్స పొందుతూ చనిపోయారు. మృతులను మహారాష్ట్ర వాసులుగా గుర్తించారు. మృతదేహాలను భారత్కు తీసుకురావడానికి ఎయిర్ఫోర్స్ విమానం నేపాల్ వెళ్లనుంది.
నేపాల్ ప్రమాదంలో 41కి చేరిన మృతుల సంఖ్య
0
171
Previous article
Next article
Latest Articles
కేసీఆర్ తిరిగి సీఎం కావాలని ప్రజలు నిజంగానే కోరుకుంటున్నారా?
తెలంగాణ రాజకీయాల్లో భారత రాష్ట్ర సమితి సరికొత్త మైండ్ గేమ్కు తెరతీసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండు ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో.. కేటీఆర్, హరీశ్ రావు ద్వయం ఒక కొత్త...
- Advertisement -
- Advertisement -


