28.2 C
Hyderabad
Saturday, September 30, 2023

లాభాలతో ముగింపు పలికిన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం లాభాలతో ముగింపు పలికాయి. ఈరోజు ఉదయం సెన్సెక్స్‌ 57,566.90 దగ్గర ఫ్లాట్‌గా మొదలవగా.. ఇంట్రాడేలో 58,019.55 – 57,415.02 మధ్య సూచీ కదలాడింది. చివరకు 126.76 పాయింట్ల లాభంతో 57,653.86 దగ్గర స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజీ నిఫ్టీ 16,984.30 వద్ద మొదలై ఇంట్రాడేలో 17,091- 16,918.55 మధ్య ట్రేడింగ్ జరిపి… చివరకు 40.65 పాయింట్లు లాభపడి 16,985.70 దగ్గర ముగిసింది. ఈరోజు మార్కెట్లు ముగిసే టైంకి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రెండు పైసలు పుంజుకొని 82.37 వద్ద ఉంది. లాభాల బాటలో రిలయన్స్‌, సన్‌ఫార్మా, మారుతీ, ఎస్‌బీఐ, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌యూఎల్‌, ఐటీసీ షేర్లు ఉన్నాయి. ఇక నష్టాల బాటలో పవర్‌గ్రిడ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఎంఅండ్‌ఎం, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎన్‌టీపీసీ, టాటా మోటార్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎల్అండ్‌టీ, నెస్లే ఇండియా షేర్లు ఉన్నాయి.

Latest Articles

వ్యక్తి కడుపులో ఇయర్‌‌ ఫోన్లు, తాళం, బోల్టులు.. షాక్‌ అయిన వైద్యులు

స్వతంత్ర వెబ్ డెస్క్: పిల్లలు ఆడుకుంటూ.. అనుకోకుండా చిన్న చిన్న వస్తువులు మింగడం చూశాం. ఇంకొందరు విన్యాసాలు చేసేందుకు కొన్ని వస్తువులు మింగి మళ్లీ తీయడం చూస్తుంటాం.. మరి కొంత మంది కాయిన్స్‌...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
289FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్