అయిదేళ్లలో రాష్ట్రం నాశనమైందన్నారు మంత్రి నారా లోకేష్. NRIలు కూడా జగన్ బాధితులే అన్నారు. కాలిఫోర్నియాకు చెందిన ఓ వ్యక్తి 500 కోట్లు అమరావతిలో పెట్టుబడి పెట్టారని చెప్పారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక విజిలెన్స్ వాళ్లను పంపి ఇబ్బందులు పెట్టారని.. అడుగడుగునా అవమానించారని మండిపడ్డారు. అయినా ఆయన ధైర్యంగా నిలబడ్డారన్నారు. చరిత్రలో ఎప్పుడూ రానివిధంగా ఈసారి కూటమి అభ్యర్థులకు భారీ మెజార్టీతో గెలిచారని.. 92శాతం సీట్లు ఇచ్చారన్నారు. మంగళగిరి ప్రజలు తనను 91వేల పైచిలుకు మెజారిటీతో గెలిపించారని చెప్పారు. రాష్ట్ర ప్రజలంతా వైసీపీని తరిమికొట్టాలని కంకణం కట్టుకోవడంతో ఇంతటి ఘనవిజయం సాధ్యమైందన్నారు నారా లోకేష్.
అయిదేళ్లలో రాష్ట్రం నాశనమైంది – నారా లోకేష్
0
148
Previous article
Latest Articles
ధడ పుట్టిస్తున్న ఎబోలా వైరస్ వ్యాప్తి.. భారత్లోకి ప్రవేశించిందా?
ఆఫ్రికాలో ఎబోలా వ్యాప్తిని అంతర్జాతీయంగా ఆందోళన కలిగించే పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. దీంతో ప్రపంచ దేశాల్లో మళ్లీ కలవరం మొదలైంది. ఎబోలా అనేది అంత్యంత అరుదైన వైరస్...
- Advertisement -
- Advertisement -


