నేడు ఏపీలో తీవ్ర వడగాల్పులు… అప్రమత్తంగా ఉండాలని సూచన

AP | మే నెల రాకముందే ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగకు ప్రజలు అల్లల్లాడిపోతున్నారు. ఉదయం 8 గంటల నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఏప్రిల్ నెలలో 40 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగానే ఉష్ణోగ్రత నమోదవుతుంది. నేడు ఏపీలో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రధానంగా నాలుగు మండలాల్లో తీవ్రమైన వడగాల్పులు వీస్తాయని తెలిపింది. ఇక 126 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. వడగాల్పుల కారణంగా ప్రజలకు ఎండ దెబ్బ తగిలే అవకాశం ఉంటుందని… ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఎండకు శరీరం డీ హైడ్రేట్ కాకుండా ఏదైనా పానీయాలు చెరుకురసం, నిమ్మరసం.. ఇలా కొన్ని పండ్ల రసాలను తీసుకుంటే కాస్త శక్తివంతంగా ఉండొచ్చని వైద్యులు చెబుతున్నారు.

Latest Articles

రాజధాని పనుల పురోగతిపై మంత్రి నారాయణ సమీక్ష

రాజధాని పనుల పురోగతిపై మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి CRDA కమిషనర్ విజయరామరాజు, అదనపు కమిషనర్లు, ఏడీసీఎల్ ఎండీ లక్ష్మీ పార్థసారథి, ఇంజినీర్లు హాజరయ్యారు. అమరావతిలో ప్రాజెక్టుల వారీగా పనుల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్