కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలో సెప్టెంబర్ 17ను తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా జరుపుకున్నామని మంత్రి సీతక్క అన్నారు. హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో రెండింటిని అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే అమలు ప్రారంభించి చరిత్ర సృష్టించామన్నారు. ఆడబిడ్డలకు తొలి ప్రాధాన్యత ఇచ్చి రాష్ట్రంలో ఏ మూలకైనా పైసా ఖర్చు లేకుండా ఆర్టీసీ బస్సుల్లో వెళ్లేందుకు అవకాశం కల్పించినట్లు ములుగులో మంత్రి సీతక్క తెలిపారు. రుణమాఫీతో తెలంగాణ రైతులు స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నారన్నారు. సన్నరకం వరిధాన్యం సాగు ప్రోత్సాహానికి క్వింటాలుకు 500 రూపాయల బోనస్ చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా సెప్టెంబర్ 17- సీతక్క
0
197
Latest Articles
జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -
- Advertisement -


