పిల్లలను పనిలోకి పంపించడం చట్టపరంగా నేరం అని చిత్తూరు జిల్లా సెక్టోరియల్ అధికారి అజయ్కు మార్ రెడ్డి అన్నారు. చదువుకునే పిల్లలను పనిలో కాదు బడికి పంపించాలని ఆయన తెలిపారు. ‘నేను బడికి పోతా’ అనే కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి అజయ్కుమార్రెడ్డి ర్యాలీ నిర్వహించారు. అనంతరం పట్టణంలోని పలు పాఠశాలలను ఆయన సందర్శించారు. బడికిరాని ఐదు గురు పిల్లలను గుర్తించి వారి తల్లిదండ్రులకు పిల్లల చదువు ప్రాముఖ్యత తెలియజేసినట్లు చెప్పారు. చదువుకునే పిల్లలను పనిలో పెట్టుకుంటే చట్టరీత్యా నేరమని, దుకాణ యజమానులు, వ్యాపారులను అజయ్కుమార్ రెడ్డి హెచ్చరించారు.