కర్నూలు సమీపంలోని పెద్దపాడు వద్ద ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. తెల్లవారుజామున ఎమ్మిగనూరు వైపు నుంచి కర్నూలుకు వస్తున్న బస్సు పెద్దపాడు వద్ద అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో బస్ కండక్టర్ తోపాటు పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. కండక్టర్ పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డ ప్రయాణికులను కర్నూలు ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 15 మంది ప్రయాణికులు ఉన్నారు. క్రేన్ సహాయంతో బస్సును అక్కడి నుంచి తరలించారు. ప్రమాదానికి అతి వేగమే కారణమా లేక నిద్రమత్తు అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.