ఏపీలో ఎన్నికలు పూర్తయి కౌంటింగ్కు సమయం దగ్గరపడటంతో అధికారులు ఏర్పాట్లలో మునిగారు. ఓట్ల లెక్కింపు నాడు అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఒకవేళ అవే పరిస్థితులు, సవాళ్లు ఎదురైతే ఎలా అధిగమించాలన్న దానిపై ఫోకస్ పెట్టారు. ఈ సందర్భంగానే నంద్యాల జిల్లాలో మాక్ డ్రిల్ నిర్వహించామాన్నారు నంద్యాల జిల్లా ఎస్పీ. ఎన్నికల కౌంటింగ్ పూర్తి అయ్యేంతవరకు ఆంక్షలు అమలులో ఉంటాయని, నిబంధనలు పట్టించు కోకుండా ఎవరైనా చట్టాన్ని అతిక్రమించి హింసాత్మక చర్యలకు పాల్పడితే ఎలాంటి చర్యలు తీసుకుం టారో జిల్లా ప్రజలకు తెలిపేందుకు బనగానపల్లె నియోజకవర్గంలో మాక్ డ్రిల్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు.