ఆంధ్రప్రదేశ్లో రామరాజ్యం వస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. తన కుటుంబం కంటే ప్రజల ఆనందమే ముఖ్యమని భావించాలని రామ కథ చెబుతోందని తెలిపారు. శ్రీరామనవమి సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. త్రేతాయుగం నాటి రామరాజ్యం గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటున్నామంటే.. ప్రజల మనోభావాలకు అనుగుణంగా సాగిన శ్రీరాముడి పాలనే కారణమని చంద్రబాబు అన్నారు. అలాంటి పాలనలోనే ఊరు పచ్చగా ఉంటుందని.. సమాజంలో శాంతి వెల్లివిరుస్తుందని తెలిపారు. మరి కొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సుభిక్షమైన, సుఖశాంతులతో కూడిన రామరాజ్యం లాంటి పాలన రావాలని కోరుకుంటున్నట్లు చంద్రబాబు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ లో రామరాజ్యం వస్తుంది – చంద్రబాబు
0
278
Previous article
Latest Articles
తెరుచుకున్న తుంగభద్ర గేట్లు… ముగ్గురు ముఖ్యమంత్రుల పూజలు
కర్ణాటక: తుంగభద్ర డ్యామ్ 33 కొత్త క్రస్ట్ గేట్లు తెరుచుకున్నాయి. గేట్లను ముగ్గురు సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి, డీకే శివకుమార్ ప్రారంభించారు. 17వ గేటును కేంద్రమంత్రి సీఆర్పాటిల్ ప్రారంభించారు. 18వ గేటును...
- Advertisement -
- Advertisement -


