ఆంధ్రప్రదేశ్లో రామరాజ్యం వస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. తన కుటుంబం కంటే ప్రజల ఆనందమే ముఖ్యమని భావించాలని రామ కథ చెబుతోందని తెలిపారు. శ్రీరామనవమి సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. త్రేతాయుగం నాటి రామరాజ్యం గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటున్నామంటే.. ప్రజల మనోభావాలకు అనుగుణంగా సాగిన శ్రీరాముడి పాలనే కారణమని చంద్రబాబు అన్నారు. అలాంటి పాలనలోనే ఊరు పచ్చగా ఉంటుందని.. సమాజంలో శాంతి వెల్లివిరుస్తుందని తెలిపారు. మరి కొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సుభిక్షమైన, సుఖశాంతులతో కూడిన రామరాజ్యం లాంటి పాలన రావాలని కోరుకుంటున్నట్లు చంద్రబాబు తెలిపారు.