భారత్​కు 100 పతకాలు.. దేశం గర్వపడేలా చేశారంటూ ప్రధాని ట్వీట్

స్వతంత్ర వెబ్ డెస్క్: ఆసియా గేమ్స్​లో భారత్ హిస్టరీ క్రియేట్ చేసింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ ఆటల్లో సత్తా చాటుతోంది. ఎన్నో ఏళ్లుగా ఆసియా గేమ్స్​లో 100 పతకాల కల గంటున్న భారత్​ కు నేడు ఆ కల నెరవేరింది. ఆసియా క్రీడల్లో హిందుస్థాన్ 100 పతకాలు గెలుచుకుంది. ఒక్క ఈరోజే మూడు గోల్డ్ మెడల్స్ సాధించింది. దీంతో ఈ క్రీడల్లో ఇండియా గెలుచుకున్న బంగారు పతకాల సంఖ్య 25కు చేరింది. 35 రజత పతకాలు.. 40 కాంస్య పతకాలను భారత్ అథ్లెట్లు సాధించారు. ఈ పోటీలు ముగియడానికి మరో రోజు ఉండటంతో భారత్ ఇంకా పతకాలు సాధించే అవకాశం ఉంది.

ఆసియా క్రీడల్లో భారత్ 100 పతకాలు సాధించడంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. ఇంతటి ఘనత అందుకున్న భారత అథ్లెట్లకు మోదీ శుభాకాంక్షలు చెప్పారు. ఎప్పుడెప్పుడు వారిని కలిసి అభినందించాలని ఉత్సాహంగా ఉందని ట్వీట్ చేశారు. దేశానికి చారిత్రక విజయాలను అందించిన అథ్లెట్లకు కృతజ్ఞతలు చెప్పారు. ఈనెల 10వ తేదీన ఆసియా క్రీడల్లో రాణించిన క్రీడాకారుల బృందానికి ఆతిథ్యమిచ్చి వారితో ముచ్చటించడానికి ఎదురుచూస్తున్నానని మోదీ ట్విటర్​లో రాసుకొచ్చారు

Latest Articles

మమతకు షాక్.. ప్రతిపక్ష నేతగా రితబ్రత బెనర్జీ గుర్తింపు

పశ్చిమ బెంగాల్‌ రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటుచేసుకున్నాయి. మాజీ సీఎం మమతా బెనర్జీకి మరో షాక్‌ తగిలింది. రెబల్‌ ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీని సభలో ప్రతిపక్ష నేతగా బెంగాల్‌ స్పీకర్‌ రథీంద్ర బోస్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్